సాపేక్ష అదనపు జనాభా/పారిశ్రామిక రిజర్వ్ సైన్యం
పరిమాణాత్మక మార్పు- గుణాత్మక
మార్పు
పెట్టుబడి
సంచయనం
మొదట్లో
కేవలం
పరిమాణాత్మక
విస్తరణగా
మాత్రమే
కనబడింది.
అదనపు
విలువ
పెట్టుబడిలోకి
మారుతూ
ఉండడం
వల్ల,
పెట్టుబడి పరిమాణంలో మార్పువస్తుంది,
పెరుగుతుంది. అంతర్నిర్మాణం అదనపు విలువ పెట్టుబడిలోకి మారుతూ ఉండడం
వల్ల పెట్టుబడి పరిమాణంలో మార్పువస్తుంది, పెరుగుతుంది. అంతర్నిర్మాణం (స్థిర అస్థిర
భాగాల నిష్పత్తి) మారకుండానే పరిమాణంలో మార్పు వస్తుంది. ఇది కేవలం పరిమాణాత్మక మార్పు
మాత్రమే. అయినప్పటికీ, పెట్టుబడి
అంతర్నిర్మాణంలో
గుణాత్మక
మార్పు
కూడా
వస్తుంది - అంటే
దాని
అస్థిర
భాగం
నష్టపోవడం
మూలంగా,
స్థిర
భాగం
నిరంతరం
పెరుగుతుంది.
ఇక్కడ
ఎంగెల్స్ ఇచ్చిన ఫుట్ నోట్ ఉంది: మూడో జర్మన్ కూర్పులో మార్జిన్లో మార్క్స్ ఈ మాటలు
రాశాడు: విస్తరణ కేవలం పరిమాణాత్మకమే అయినట్లయితే,
అప్పుడు ఒకే శాఖలో పెట్టుబడికైనా, తక్కువ పెట్టుబడికైనా పెట్టిన పెట్టిబడి పరిమాణాలకి
అనుగుణంగా లాభాలు వస్తాయి. పరిమాణాత్మక విస్తరణ గుణాత్మక మార్పుని ప్రేరేపిస్తే, పెద్ద
పెట్టుబడిమీద లాభం రేటు పెరుగుతుంది. - ఇది తర్వాత పూర్తిచేయాల్సిన అంశం అని అక్కడ
ఉంది.
అంతర్నిర్మాణం మారడం
పెట్టుబడిదారీ
ఉత్పత్తి
విధానం
అభివృద్ధి
అయ్యేకొద్దీ
శ్రమ
ఉత్పాదకత
పెరుగుతుంది.
ఫలితంగా
పెట్టుబడి
అంతర్నిర్మాణంలో
మార్పువస్తుంది.
ఆమార్పు
పెట్టుబడి
సంచయనం
పురోగమనమనానికి
గానీ,
సామాజిక
సంపద
వృద్ధికి
గానీ
సరిపడే
స్థాయిలో
మాత్రమే
ఉండదు.
అంతకన్నా
వేగంగా
ఉంటుంది..
కారణం:
కేవలం
సంచయనం
-మొత్తం
సామాజిక
పెట్టుబడిలో
పరమ
పెరుగుదల-
ఆమొత్తం
పెట్టుబడిలో
భాగాలైన
వ్యష్టి
పెట్టుబడుల
కేంద్రీకరణ
అనుసరిస్తుంది;
అదనపు
పెట్టుబడి
యొక్క
సాంకేతిక
అంతర్నిర్మాణంలో
మార్పు,
మూల
పెట్టుబడి
యొక్క
సాంకేతిక
అంతర్నిర్మాణంలో
అలాటి
మార్పునే
తెస్తుంది
గనక.
అందువల్ల,
సంచయనం
పురోగమించేకొద్దీ
స్థిర
భాగంతో
అస్థిర
భాగం
నిష్పత్తి
మారుతుంటుంది.మొదట
1:1 అయితే,
అది
వరసగా
2:1, 3:1, 4:1,
5:1, 7:1,అలా
అవుతుంది.
అందువల్ల
పెట్టుబడి
పెరిగేకొద్దీ,
దాని
మొత్తం
విలువలో
సగానికి
(1/2) బదులుగా
1/3, 1/4, 1/5,
1/6, 1/8 అలా
శ్రమశక్తిలోకి
మారుతుంది.
మరొకపక్క
2/3, 3/4, 4/5,
5/6, 7/8 ఉత్పత్తిసాధనాల్లోకి
మారుతుంది.
శ్రమకి
గిరాకీ
శ్రమ
గిరాకీ
నిర్ణయమయ్యేది
మొత్తం
పెట్టుబడివల్ల
కాదు,
ఒక్క
అస్థిర
భాగం
వల్ల
మాత్రమే.
కాబట్టి, మొత్తం పెట్టుబడి
పెరుగుదలతో
శ్రమ
గిరాకీ, ఇంతకుముందు ఊహించినట్లు దానికి
అనుగుణంగా
పెరగడానికి బదులు క్రమానుగతంగా
(progressively ) పడిపోతుంది.
మొత్తం
పెట్టుబడి
పరిమాణానికి
సాపేక్షంగా
ఈ
పరిమాణం
పెరిగేకొద్దీ,
ఎక్కువ
స్థాయిలో
పడిపోతుంది.
మొత్తం
పెట్టుబడి
వృద్ధితో
అందులో
ఇమిడివున్న
అస్థిర
భాగం
కూడా
పెరుగుతుంది;
కాని
ఆ
పెరుగుదల
నిష్పత్తి
నిరంతరం
తగ్గుతూనే
ఉంటుంది.
ఒక
నిశ్చిత
సాంకేతిక
ప్రాతిపదికమీద
సామాన్య
విస్తరణగా
సంచయనం
సాగే
మధ్యంతర
విరామకాలాలు
కుదించబడతాయి.
అదనంగా
కార్మికుల్ని
పెట్టుకోవాలన్నా,
పనిలో
ఉన్నవాళ్ళని
నిలుపుకోవాలన్నా,
మొత్తం
పెట్టుబడి
సంచయనం
వేగంగా
పెరిగినంత
మాత్రాన
సరిపోదు.
సంచయనం
పెరుగుదలా
కేంద్రీకరణా పెట్టుబడి అంతర్నిర్మాణంలో
మార్పులకి
వనరౌతాయి.
అంటే,స్థిర
భాగంతో
పోలిస్తే,
అస్థిరభాగం
వేగంగా
తగ్గడానికి
ఆధారమౌతాయి.
ఇదంతా
ఎలా
కనబడుతుందంటే:
శ్రామిక
జనాభా
వృద్ధి
పెట్టుబడి
వృద్ధిని
అధిగమించించినట్లు
అగపడుతుంది.
వేతనాలు
తక్కువ
ఉండడానికి
కారణం
ఎక్కువమంది
ఉండడమే
అనిపిస్తుంది.
అయితే
వాస్తవానికి
సాపేక్ష అదనపు కార్మిక జనాభాని ఉత్పత్తిచేసేది పెట్టుబడి దారీ సంచయనమే;
దాని
శక్తికీ,
విస్తృతికీ
అనులోమ
నిష్పత్తిలో
ఉత్పత్తిచేస్తుంది.
సాపేక్ష
అదనపు
జనాభా
అంటే:
పెట్టుబడి
స్వయం
విస్తరణకి
సరిపోయే
జనాభా
కన్న
అదనంగా
ఉన్న
జనాభా.
పెట్టుబడి సరిగ్గా దానికి కావలసిన దాన్ని పెట్టుబడే ఉత్పత్తి చేసుకుంటున్నది.
సామాజిక పెట్టుబడిని మొత్తంగా చూస్తే, దాని సంచయన చలనం కొన్ని సందర్భాల్లో నియమిత కాలాల్లో మార్పులు తెస్తుంది. ఇతర సందర్భాల్లో ఏకకాలంలో భిన్న ఉత్పత్తి రంగాలకు దాని వివిధ దశల్ని పంపిణీ చేస్తుంది.కొన్ని రంగల్లో పరమ పరిమాణంలో మార్పులేకుండానే, పెట్టుబడి అంతర్నిర్మాణంలో మాపు వస్తుంది; ఇంకొన్ని రంగల్లో పెట్టుబడి పరమ వృద్ధి, దాని అస్థిర భాగం తగ్గుదలతో ముడిబడి ఉంటుంది. వేరే మాటల్లో, అది పీల్చుకునే శ్రమ శక్తి తగ్గుదలతో ముడిబడి ఉంటుంది; మరి కొన్ని రంగల్లో అప్పటికున్న సాంకేతిక ప్రాతిపదిక మీద కొంతకాలం పెట్టుబడి వృద్ధి అవుతూ, ఆ వృద్ధికి తగినట్లు అదనపు శ్రమశక్తిని తీసుకుంటుంది, కొన్ని ఇతర సందర్భాల్లో అంతర్నిర్మాణం మార్పు చెంది అస్థిర భాగం తగ్గుతుంది; అన్ని రంగాల్లోనూ అస్థిరభాగం పెరుగుదల, అందువల్ల కార్మికుల సంఖ్యలో పెరుగుదల తీవ్రమైన హెచ్చుతగ్గులతోనూ, తాత్కాలిక అదనపు జనాభా ఏర్పడడంతోనూ ఎల్లప్పుడూ ముడిబడి ఉంటుంది. అయితే ఆ సంబంధం అప్పటికే పనిలో వున్న కార్మికుల్ని వికర్షించే విస్పష్ట రూపమైనా తీసుకోవచ్చు.లేక అంత స్పష్టమైనది కాకపోయినా అంటే వాస్తమైన రూపమైనా - మామూలు మార్గాలద్వారా అదనపు కార్మికుల్ని అతి కస్ఠం మీద మాత్రమే ఇముడ్చుకోగల రూపమైనా - తీసుకోవచ్చు.
సామాజిక పెట్టుబడిని మొత్తంగా చూస్తే, దాని సంచయన చలనం కొన్ని సందర్భాల్లో నియమిత కాలాల్లో మార్పులు తెస్తుంది. ఇతర సందర్భాల్లో ఏకకాలంలో భిన్న ఉత్పత్తి రంగాలకు దాని వివిధ దశల్ని పంపిణీ చేస్తుంది.కొన్ని రంగల్లో పరమ పరిమాణంలో మార్పులేకుండానే, పెట్టుబడి అంతర్నిర్మాణంలో మాపు వస్తుంది; ఇంకొన్ని రంగల్లో పెట్టుబడి పరమ వృద్ధి, దాని అస్థిర భాగం తగ్గుదలతో ముడిబడి ఉంటుంది. వేరే మాటల్లో, అది పీల్చుకునే శ్రమ శక్తి తగ్గుదలతో ముడిబడి ఉంటుంది; మరి కొన్ని రంగల్లో అప్పటికున్న సాంకేతిక ప్రాతిపదిక మీద కొంతకాలం పెట్టుబడి వృద్ధి అవుతూ, ఆ వృద్ధికి తగినట్లు అదనపు శ్రమశక్తిని తీసుకుంటుంది, కొన్ని ఇతర సందర్భాల్లో అంతర్నిర్మాణం మార్పు చెంది అస్థిర భాగం తగ్గుతుంది; అన్ని రంగాల్లోనూ అస్థిరభాగం పెరుగుదల, అందువల్ల కార్మికుల సంఖ్యలో పెరుగుదల తీవ్రమైన హెచ్చుతగ్గులతోనూ, తాత్కాలిక అదనపు జనాభా ఏర్పడడంతోనూ ఎల్లప్పుడూ ముడిబడి ఉంటుంది. అయితే ఆ సంబంధం అప్పటికే పనిలో వున్న కార్మికుల్ని వికర్షించే విస్పష్ట రూపమైనా తీసుకోవచ్చు.లేక అంత స్పష్టమైనది కాకపోయినా అంటే వాస్తమైన రూపమైనా - మామూలు మార్గాలద్వారా అదనపు కార్మికుల్ని అతి కస్ఠం మీద మాత్రమే ఇముడ్చుకోగల రూపమైనా - తీసుకోవచ్చు.
దీనికి
సంబంధించిన
ఫుట్
నోట్
శాఖ
/పరిశ్రమ
|
1851
|
1861
|
తేడా
|
*వ్యవసాయం
|
2,011,447
|
1,924,110
|
-87,337
|
**మేలైన
ఉన్ని
పరిశ్రమ
|
102,714
|
79,242
|
-23,472
|
సిల్కు
నేత
|
111,940
|
101,678
|
-10,262
|
***కాలికో ప్రింటింగ్
|
12,098
|
12,556
|
+458
|
టొపీల
తయారీ
|
15,957
|
13,814
|
-2,143
|
స్ట్రా
టొపీల తయారీ
|
20,393
|
18,176
|
-2,167
|
Malting
|
10,566
|
10,677
|
+111
|
****మైనం వస్తువుల తయారీ
|
4,949
|
4,686
|
-263
|
దువ్వెనల తయారీ
|
2,038
|
1,478
|
-560
|
*****రంప కోత
|
30,552
|
31,647
|
+1,095
|
******చీలల
తయారీ
|
26,940
|
26,130
|
-810
|
తగరం, రాగి
గనుల్లో
|
31,360
|
32,041
|
+681
|
కాటన్ వడకడం,
నెయ్యడం
|
371,777
|
456,646
|
+84869
|
బొగ్గు
గనుల్లో
|
183,389
|
246,613
|
+63224
|
*వ్యవసాయంలో
ఉన్న
వాళ్ళు,
అంటే భూస్వాములు,రైతులు,తోటమాలులు,గొర్ల
కాపరులు
మొదలైనవాళ్ళు
**మేలైన
ఉన్ని పరిశ్రమ – worsted manufacture
***ఈ
పరిశ్రమ భారీస్థాయిలో వృద్ధిచెందినా గాని, కార్మికులు స్వల్పంగా మాత్రమే పెరిగారు.
దానర్ధం:పెరిగిన ఉత్పత్తికి దామాషా ప్రకారం ఉండాల్సినంద్తమందికంటే తక్కువ మంది కార్మికులు
ఉన్నారు అని.
****
ఈ తగ్గుదలకి ఒక కారణం వెలుతురు కోసం కొవ్వొత్తులతో పాటు గాస్ వాడకం పెరగడం.
******
కోత మిషన్లు విస్తరించినందువల్ల ఈ రంగంలో కార్మికుల నియామకం కొద్దిగా పెరిగింది.
******
యంత్రాల పోటీ మూలంగా కార్మికులు తగ్గారు.
పై
సమాచారాన్ని బట్టి ఏకొన్నింటిలోనో తప్ప, అన్నింటిలోనూ కార్మికుల సంఖ్య తగ్గినట్లు తేలుతుంది.
కార్మికుల సంఖ్య పెరిగిన పరిశ్రమలు: 1. కాలికో ప్రింటింగ్
2. Malting 3. రంప కోత 4. తగరం, రాగి గనుల్లో 5. కాటన్ వడకడం, నెయ్యడం 6. బొగ్గు గనుల్లో
1851 తర్వాత యంత్రాల్ని సమర్ధవంతంగా వాడలేని శాఖల్లో శ్రామికుల పెరుగుదల
అత్యధికంగా ఉంది. (Census of England and Wales for the Year 1861, Vol. 3, London,
1863, p. 36).
ఇదివరకే
ఉన్న సామాజిక పెట్టుబడి పరిమాణాన్నీ, దాని పెరుగుదల స్థాయితో పాటు, ఉత్పత్తి స్థాయి
విస్తరణ, పనిలో నియమించబడిన కార్మికుల సంఖ్యతో పాటు, వాళ్ళ శ్రమ ఉత్పాదకత అభివృద్ధితో
పాటు, సంపద యొక్క సకల వనరుల పూర్తి విస్తృతితో పాటు - పెట్టుబడి శ్రామికుల్ని పెద్దగా
అకర్షించడం అనేది పెద్దగా వికర్షించడాన్ని అనుసరించి ఉంటుంది.
పెట్టుబడి
అంతర్నిర్మాణమూ, దాని సాంకేతిక రూపమూ మారే వేగం పెరుగుతుంది. ఈ మార్పులకి గురయ్యే ఉత్పత్తిరంగాలు
సంఖ్య రీత్యా పెరుగుతాయి. ఒకప్పుడు ఏకకాలంలో
పెరిగితే, మరొకప్పుడు మార్చి మార్చి పెరుగుతాయి.
అందువల్ల,
శ్రామిక
జనాభా
తాను
ఉత్పత్తిచేసే
సంచయనంతో
పాటుగా,
తన్నుతాను
సాపేక్షంగా
అనావశ్యకం
చేసుకుని,
సాపేక్ష
అదనపు
జానాభాలోకి
మార్చే
సాధనాన్ని
కూడా
ఉత్పత్తి
చేస్తుంది.
అలా
ఎల్లప్పుడూ
అంతకంతకూ
పెరుగుతూ
పోయేట్లు
చేస్తుంది.
ఇది
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి ప్రత్యేకమైన జనాభా సిద్ధాంతం; వాస్తవానికి ప్రతి ప్రత్యేక చారిత్రక ఉత్పత్తి విధానానికీ దానికి
సంబంధించిన ప్రత్యేక జనాభా నియమాలు ఉంటాయి.
అవి ఆ ఉత్పత్తి విధానంలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
అదనపు
శ్రామిక
జనాభా
సంచయనం
మూలంగా
ఏర్పడుతుంది.ఇదే అదనపు
జనాభా
విపర్యయంగా
(conversely)పెట్టుబడి
సంచయనానికి
కీలక
సాధనం
అవుతుంది.
అసలు,
పెట్టుబడిదారీ
ఉత్పత్తికి
విధానం
ఉనికికే
షరతు
అవుతుంది.
అవసరమైనప్పుడు
పెట్టుకొని,
అది
తీరగానే
నెట్టివేసేందుకు
వీలయిన
/ వాడుకొని
వదిలేసే
(disposable) నిల్వ
కార్మిక
సైన్యంగా
ఉంటుంది.
పెట్టుబడికి
చెంది,
దాని
అధీనంలో
ఉంటుంది.
పెట్టుబడే
తన
సొంత
ఖర్చుతో
దాన్ని
పెంచి
పోషిస్తున్నట్లు
అగపడుతుంది.
జనాభా
పెరుగుదల
పరిమితులతో
నిమిత్తం
లేకుండానే,
అది
పెట్టుబడి
స్వయం
విస్తరణ
అవసరాలకు,
దొపీడీ
కొరకు మనుషుల
గుంపుని
సిద్ధం
చేస్తుంది.
పెట్టుబడి
ఆకస్మికంగా
విస్తరించే
అవకాశం
ఉంది.అప్పుడు
పెట్టుబడికి
నిల్వ
ఉన్న
నిరుద్యోగ
సైన్యంతో
అవసరం
వస్తుంది.
అలాంటి రెండు సందర్భాలు
1.కొన్ని ప్రత్యేక శాఖల్లో అదనపు పెట్టుబడి వేగంగా విస్తరించడం:
అప్పటికే
ఉన్న కొన్ని శాఖల్లో మార్కెట్ విస్తరిస్తుంది.
వాటిలోకి
అదనపు
పెట్టుబడి
చొచ్చుకు
పోతుంది.
ఉత్పత్తి
ప్రక్రియలో
యంత్రాలూ,
రవాణా
సాధనాలూ
వగైరా
సాంకేతిక
పరిస్థితుల
వల్ల
కూడా
పెట్టుబడి విస్తరిస్తుంది. ఇప్పుడు
అదనపు
ఉత్పాదితం
రాసులు
అంత్యంత/అమిత
వేగంగా
అదనపు
ఉత్పత్తిసాధనాల్లోకి
మార్చబడతాయి.
సంచయనతో
సామాజిక
సంపద
రాశి
పొంగిపొర్లుతుంటుంది.అది అదనపు
పెట్టుబడిలోకి
మారగలదు.
కనక
అది
ఉడ్రేకపూరితంగా,
పద్ధతి
లేకుండా
పాత
ఉత్పత్తి
శాఖలకు
చొచ్చుకు
పోతుంది. ఆశాఖల
మార్కెట్
అకస్మాత్తుగా
విస్తరిస్తుంది.
అంతే
కాదు,
పాతవి
వృద్ధి
చెందినందువల్ల
రైల్వేలు
మొదలైన
కొత్త
రంగాలు
అవసరమవుతాయి,
అందువల్ల
కొత్తకొత్త
రంగాలు
వస్తాయి.
అటువంటప్పుడు,
పాత
రంగాలకు
నష్టం
వాటిల్లకుండా,
కొత్త
రంగాలకు
అనేకమంది
కార్మికులు
వచ్చే
అవకాశం
ఉండాలి.
ఆ
కార్మికుల్ని
అందుబాటులో ఉంచేదీ,
సరఫరా
చేసేదీ
ఈ అదనపు జనాభాయే.
2. పారిశ్రామిక వలయంలో వికాసదశ,
సంక్షోభదశ ఉండడం . పారిశ్రామిక వలయంలో ని వివిధ
దశలు
ఆధునిక
పరిశ్రమ
ఒకేస్థాయిలో
నడవదు.ఒడుదుడుకులుంటాయి.
ఒక
పారిశ్రామిక వలయం పదేళ్ళు. వలయం 4 దశలగుండా
గుండా
సాగుతుంది. 1. సగటు కార్యకలాపం.2.అత్యధిక
ఉత్పత్తి
3.స్థబ్దత
4.సంక్షొభం పదేళ్ళు పట్టే
ఈ
వలయం
నిరంతరం
ఏర్పడుతూ,
ఎక్కువగానో
తక్కువగానో
నియామకం
పొందుతూ,
తిరిగి
ఏర్పడే,
పారిశ్రామిక
నిల్వ
సైన్యం
మీద
ఆధారపడి
ఉంటుంది.
పారిశ్రామిక
వలయంలోని
వివిధ
దశలు
వాటి
వంతుకవి
అదనపు
జనాభాని
పనిలో
పెట్టుకుంటాయి.
అదనపు
జనాభాని
పునరుత్పత్తిచేసే
అత్యంత
శక్తివంతమైన
సాధనాలు
అవుతాయి.
ఆధునిక
పరిశ్రమకి మాత్రమే ప్రత్యేకమైన లక్షణం ఇది.
మానవ
చరిత్రలో
ఇంతకుముందు
ఏదశలోనూ
జరగలేదు.అది పెట్టుబడిదారీ
ఉత్పత్తి
పసిదశలో
సైతం
అసాధ్యమే.
అప్పట్లోనూ
పెట్టుబడి
అంతర్నిర్మాణం
మారుతుండేదే
గాని
అతి
నెమ్మదిగా
మాత్రమే
మారుతుండేది.
అందువల్ల
పెట్టుబడి
సంచయనంతో
పాటుగా,
దానికి
అనుగుణంగా,
శ్రమకి
గిరాకీ
మొత్తం
మీద
అంతే
వేగంతో
నడిచింది.
మరింత
ఆధునిక
కాలాల్లో
అసంచయన
పురోగమనంతో
పోలిస్తే,
నెమ్మదిగా
పురోగమించింది.
అయినా
దాని
పురోగమనానికి
కార్మిక
జనాభా
సహజ
పరిమితి
అవరోధం
అయింది.
ఆ
పరిమితులు
బలాత్కార
సాధనాల
వల్ల
మాత్రమే
తొలిగిపోయాయి-
అని
ముందుముందు
తెలుసుకుంటాము.
ఉత్పత్తిస్థాయి
పెరుగుతూ,
ఆగుతూ
విస్తరించడం
ఆకస్మికంగా
క్షీణించడానికి
ముందు
ఉండే
అంశం.
క్షీణత
తిరిగి
విస్తరణని
ప్రేరేపిస్తుంది.
అయితే
వాడి
వదిలేసే
(disposable)
శ్రామికులు
లేనిదే,
విస్తరణ
సాధ్యపడదు.
ఆధునిక
పరిశ్రమ
చలనం
అంతా
శ్రామిక
జనాభాలోఒక
భాగాన్ని
నిరుద్యోగులుగానో,
చిరుద్యోగులుగానో
సదా
మార్చివేయడం
మీద
ఆధారపడి
ఉంటుంది
అర్ధశాస్త్రజ్ఞుల డొల్లతనం
రాజకీయ
అర్ధశాస్త్రం
రుణ
విస్తరణని
ఉత్పత్తి విస్తరణకి
కారణంగానూ , రుణ క్షీణతని, ఉత్పత్తి క్షీణతకి కారణంగానూ
భావించింది.
వాస్తవానికి
రుణం
పెరగడం
తరగడం
అనేది
పారిశ్రామిక
వలయంలో
వచ్చే
మార్పులకి
కేవలం
లక్షణం
(symptom) మాత్రమే.
ఆ
లక్షణాన్నే
కారణంగా(cause)
భావించి,
అప్పటి
అర్ధశాస్త్రం
దాని
డొల్లతనాన్ని
బయటపెట్టుకుంది.
అంతరిక్షంలో నిర్దిష్ట చలనంలోకి ఒకసారి విసిరివేయబడిన
నక్షత్రాలు
వగైరా
(heavenly bodies) అదే
చలనాన్ని
ఎలా
పునరావృతం
చేస్తాయో,
అలాగే సామాజిక ఉత్పత్తి
కూడా
విస్తరణ
క్షీణత
మార్చిమార్చి
వచ్చే
చలనంలోకి
ఒకసారి నెట్టబడితే
ఆ
చలనం
పునరావృతం
అవుతూనే
ఉంటుంది.
ఫలితాలే
తిరిగి
కారణలు
అవుతాయి.మొత్తంప్రక్రియలో
వచ్చే
ఆకస్మిక
మార్పులు
ఆవర్తకత
(periodicity )రూపం
తీసుకుంటాయి.
వ్యాపార వలయం ఆరంభం
వ్యాపార వలయం ఆరంభం కావడానికి అవసరమైన ప్రక్రియల్ని ఫ్రెంచ్ కూర్పులో ప్రస్తావించాడు:
యంత్రపరిశ్రమ జాతీయ ఉత్పత్తిమీద ప్రబలమైన ప్రభావం నెరిపే తంతగా వేళ్ళూనుకున్న తర్వాత మాత్రమే; విదేశీ వాణిజ్యం దేసీయ వర్తకం కంటే ముఖ్యమైనది అయిన తర్వాత మాత్రమే; ప్రపంచ మార్కెట్ నూతన ప్రపంచాంలోనూ,ఆసియ, ఆస్ట్రేలియ ఖందాలలోని (పశ్చిమార్ధగోళమ్ళోని ఎక్కువ దేశాలు ) విస్తృత భాగాల్ని వరసగా ఆక్రమించిన తర్వాత; అంతిమంగా తగినన్ని పరిశ్రామిక దేశాలు రంగంలోకి దిగిన తర్వాత మాత్రమే; ఇదంతా జరిగాకనే వాటికవి పునరావృతమయ్యే వలయాలు మొదలయ్యాయి. వాతి వరస దశలు సంవత్సరాలపాటు సాగుతాయి.తుది దశ సాధారణ సంక్షోభం. ఆదశ ఒక వలయానికి ముగింపు, మరొక వలయానికి మొదలు. ఇప్పటివరకూ, వలయ కాలం పది, పదకొండేళ్ళు. అయితే అంతె కాలాన్ని స్థిరమైనదిగా భావించడానికి వీలు లెదు. అందుకు భిన్నంగా, మనం తేల్చిన పెట్టుబడిదారీ ఉత్ప్త్తి నియమాల్ని బట్టి, వలయాల కాలాలు మారుతూ ఉంటాయనీ, క్రమంగా వాటి పొడవు తగ్గుతూపోతుందనీ నిర్ధారించాల్సి ఉంటుంది.
వలయాన్ని గురించీ, అదనపు జనాభా గురించీ ఆర్ధిక వేత్తల అభిప్రాయాలు
వలయాలు
అవే దశలగుండా నడవడమూ, నిరుద్యోగ సైన్యం ఏర్పడడమూ స్థిరగా కొనసాగుతున్నాక, అర్ధశాస్త్రం
సైతం
సాపేక్ష
అదనపు
జనాభా
ఉత్పత్తిని
ఆధునిక
పరిశ్రమకి,
పెట్టుబడి
స్వయం
వృద్ధికి
అవసరమైన
షరతుగా
గమనించింది.
కొన్ని
సంక్షోభాలు
సంభవించినప్పుడు,
లక్షలకు
లక్షలమంది
అదనపు
శ్రామికుల్ని
వలస
పంపి
ఆ
దేశం
వదిలించుకునే
యత్నం
చేస్తే,
పర్యవసానం
ఎలా
ఉంటుంది?
మళ్ళీ
శ్రామికులు
కావలసి
వచ్చినప్పుడు
కార్మికుల
కొరత
ఉంటుంది.పునరుత్పత్తి
ఎంత
వేగం
జరినా,
కార్మికుల
కొరత
భర్తీ
చెయ్యడానికి
కనీసమొక
తరం
కాలం
పడుతుంది.
కార్ఖానా
యజమానుల
లాభాలు,
గిరాకీ
చురుకుగా
ఉన్నకాలాన్ని
లాభదాయకంగా
ఉపయోగించుకోవడం
మీద
ఆధారపడి
ఉంటాయి.
గిరాకీ
మందగించిన
కాలంలో
వచ్చిన
నష్టాన్ని
ఆవిధంగా
భర్తీ
చేసుకుంటారు/
పరిహరించుకుంటారు.
ఈ
శక్తి
వాళ్ళకి
ఎలా
సమకూరుతుంది?
యంత్రాలమీదా,
శ్రామికులమీదా
వాళ్ళకుండే
ఆధిపత్యం
వల్ల
సమకూరుతుంది.వాళ్ళు
ఉత్పత్తిని
పెంచాలి
అనుకున్నప్పుడు
వాళ్ళకి
కార్మికులు
రెడీ
గా
ఉండాలి.
కావాల్సొచ్చినప్పుడు
వాళ్ళ
కార్యకలాపాల్ని
హెచ్చించుకో
గలగాలి.అలాగే
మార్కెట్
పరిస్థితికి
తగినట్లు
తగ్గించుకోగలగాలి.
లేకపోయినట్లయితే,
వాళ్ళు
దేశ
సంపదకి
గట్టి
పునాది
వేసే
పోటీ
పందెంలో
ఆధిపత్యాన్ని/
ఆధిక్యతని
నిలబెట్టుకోలేరు.
మాల్థూస్
సైతం
ఆధునిక
పరిశ్రమకి
అదనపు
జనాభా
అవసరం
అని
గుర్తించాడు.అయితే
ఆయన
తన
సంకుచిత
భావాలకు
తగ్గట్లుగా,దాన్ని
కార్మికులు
సాపేక్షంగా
అనావశ్యకం
అవడం
వల్ల
కాకుండా,
శ్రామిక
జనాభా
పరమ
పెరుగుదల
వల్ల
అంటూ
వివరించాడు.
నిరుద్యోగ నిల్వ సైన్యం పెట్టుబడి కాంక్ష
సహజ
జనాభా
పెరుగుదలతో
పాటు
పెట్టుబడిదారీ
ఉత్పత్తి
అవసరమైనప్పుడు
వాడుకొని
లేనప్పుడు
అవతల
పడెయ్యడానికి వీలుగా ఉండే (disposable)శ్రమశక్తిని
సమకూరుస్తుంది.
అయితే,
పెట్టుబడిదారీ
ఉత్పత్తి
అంతమాత్రాన
తృప్తిపడదు.
తన
కార్యకలాపాల్ని
అపరిమితంగా
నిర్వహించడానికి
ఈ
సహజ
పరిమితులతో
నిమిత్తం
లేకుండా పారిశ్రామిక నిల్వ
సైన్యం
రెడీగా
ఉండాలని కాంక్షిస్తుంది. వాణిజ్య వలయం అధిక జనాభాని
ఆశిస్తుంది,అలాగే
దాన్ని
ఏర్పరుస్తుంది
కూడా.
వచ్చే పోస్ట్: వేతనాలు పెరగడమూ - తగ్గడమూ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి